Sarkaru Vaari Paata - మరో భారీ షెడ్యూల్

Sunday,July 04,2021 - 02:16 by Z_CLU

లాక్ డౌన్ తర్వాత సినిమాలన్నీ ఒక్కొక్కటిగా సెట్స్ పైకొచ్చాయి. ముందుగా ఓ మోస్తరు సినిమాలు, ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు షూటింగ్స్ స్టార్ట్ చేశాయి. ఇప్పుడు మహేష్ బాబు వంతు. సూపర్ స్టార్ కూడా తన కొత్త సినిమా షెడ్యూల్ ఎనౌన్స్ చేశాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 15 నుంచి సర్కారువారి పాట కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. దుబాయ్ షెడ్యూల్ తర్వాత, హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అయితే కరోనా కేసులు పెరగడంతో వెంటనే షూటింగ్ నిలివేశారు. అలా ఆగిపోయిన షూటింగ్ ను 15 నుంచి తిరిగి ట్రాక్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

mahesh babu zeecinemalu

ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. మిగతా సినిమాలకు భిన్నంగా మహేష్ బాబు సినిమా కోసం భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అంటే, ఈ షెడ్యూల్ తో సినిమాలోని కీలక నటీనటులంతా ఒకేసారి సెట్స్ పైకి రాబోతున్నారు. హీరో మహేష్, హీరోయిన్ కీర్తిసురేష్, వెన్నెల కిషోర్, రావురమేష్.. ఇలా చాలామంది
నటీనటులు ఒకేసారి సెట్స్ పైకి రాబోతున్నారు. సింగిల్ షెడ్యూల్ లో కాంబినేషన్ సీన్స్ అన్నీ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట దర్శకుడు పరశురాం.

ఇక సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ మేటర్ కూడా బయటకొచ్చింది. సర్కారువారి పాట సినిమాకు సంబంధించి టీజర్ రెడీ అవుతోంది. కరోనా/లాక్ డౌన్ ప్రభావం లేకపోతే ఆగస్ట్ 9కి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల
చేయబోతున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics