కలిసి పండగ చేసుకున్న మహేష్, చరణ్

Wednesday,December 26,2018 - 11:34 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఫ్రీ టైం దొరికితే కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి ఇద్దరూ ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈసారి అలాంటి ఖాళీ సమయం ఇద్దరికీ దొరికింది. పైగా క్రిస్మస్ కలిసొచ్చింది. ఇంకేముంది హీరోలిద్దరూ కలిసి పండగ చేసుకున్నారు.

అవును.. ఈ క్రిస్మస్ ను చెర్రీ, మహేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో గ్రాండ్ గా జరిగిన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు చరణ్, మహేష్, ఉపాసన, నమ్రత, సితారతో పాటు రెండు కుటుంబాలకు చెందిన కొంతమంది బంధువులు హాజరయ్యారు.

వీళ్ల సెలబ్రేషన్స్ కు సంబంధించిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చరణ్, మహేష్ దిగిన సెల్ఫీతో పాటు సితారతో ఉపాసన దిగిన ఫొటో అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.

ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ లో మహేష్ బిజీగా ఉన్నాడు. అటు వినయ విధేయ రామ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన చరణ్, రాజమౌళి సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు.