హాట్ టాపిక్: మహేష్-ఎన్టీఆర్ మల్టీస్టారర్

Wednesday,July 22,2020 - 02:20 by Z_CLU

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి ‘RRR’సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎవైటింగ్ మల్టీస్టారర్ గా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్న ఈ మూవీ తర్వాత ఇప్పుడు మరో బడా కాంబినేషన్ హాట్ టాపిక్ గా మారింది. మహేష్, ఎన్టీఆర్ కాంబోలో ఓ పెద్ద మూవీ రానుందనే ప్రచారంతో ఇటు మహేష్ ఫ్యాన్స్ అటు తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో మహేష్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ మేరకు సూపర్ స్టార్ కి అల్లు అరవింద్ అడ్వాన్స్ కూడా అందించారు. మహేష్ తో సినిమా తీసేందుకు కథలు సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట అరవింద్. అయితే మహేష్ తో అరవింద్ నిర్మించే సినిమాలో తారక్ కూడా నటిస్తాడనే ప్రచారం జరుగుతుంది.

ఇంకా కథ ఫైనల్ అవ్వలేదు… మహేష్, అల్లు అరవింద్ కాంబో అనౌన్స్ మెంట్ రాలేదు. కానీ ఉన్నఫళంగా ఎన్టీఆర్ పేరు తెరపైకి ఎలా వచ్చిందో అర్థం కాని పరిస్థితి. నిజానికి ఈ ప్రచారంలో నిజం లేకపోవచ్చు కానీ ఈ కాంబోలో సినిమా వస్తే మాత్రం కళ్ళు చెదిరే ఒపెనింగ్స్ తో పాటు భారీ కలెక్షన్స్ రావడం మాత్రం ఖాయం.