టైటిల్ ఫిక్స్... అనౌన్స్ మెంట్ బ్యాలెన్స్

Saturday,May 30,2020 - 01:00 by Z_CLU

అవును.. మహేష్, పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ టైటిల్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తెలుగు ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు. దీంతో సినిమాకు ఇదే టైటిల్ పెట్టబోతున్నారని కన్ఫర్మ్ అయింది.

రేపు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను అనౌన్స్ చేసి పోస్టర్ వదలబోతున్నారు.

ఉదయాన్నే మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులో కొద్దిమందితో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ ఓపెనింగ్ కి మహేష్ భార్య నమ్రత , మైత్రీ నిర్మాతలు, 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట , గోపీ ఆచంట, అలాగే చిత్ర దర్శకుడు పరశురాం లతో పాటు కొరటాల శివ, సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ విషయాన్ని కూడా రేపే పోస్టర్ లో ప్రకటిస్తారు.