Mahesh-Trivikram - క్రేజీ అప్ డేట్

Wednesday,October 07,2020 - 04:59 by Z_CLU

కొన్ని రిపీట్ కాంబినేషన్ సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఎప్పుడెప్పుడు ఆ కాంబో సినిమా గురించి అప్డేట్ వస్తుందా అని చూస్తుంటారు. ఏ మాత్రం హింట్ వచ్చినా పండగ చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి ఓ కాంబినేషన్ ఫ్యాన్స్ ను ఆనందపెడుతుంది. Mahesh-Trivikram కాంబినేషన్ లో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలొచ్చాయి. ఈ రెండు సినిమాలు మహేష్ తో పాటు ఫ్యాన్స్ కి కూడా ఎప్పటికీ స్పెషల్ గా ఉంటాయి. ఈ కాంబోలో మూడో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

మధ్యలో కొన్ని సార్లు ఇద్దరూ సినిమా చేద్దామనుకున్నా ఎందుకో కుదరలేదు. ఫైనల్ గా ఇప్పుడీ కాంబోలో సినిమా రాబోతుంది. ఈ విషయంపై తాజాగా హింట్ ఇచ్చాడు మహేష్.

‘ఖలేజా’ విడుదలై పదేళ్ళయిన సందర్భంగా ఆ సినిమా తనకి ఎంతో స్పెషల్ అంటూ చెప్పుకొచ్చిన సూపర్ స్టార్ అదే ట్వీట్ లో తన మిత్రుడు బ్రిలియంట్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఎదురుచూస్తున్నానని తెలియజేస్తూ… అతి త్వరలోనే అది జరగనుందని చెప్పాడు.

దీంతో ఎప్పటి నుండో ప్రేక్షకుల్లో నానుతున్న ఈ కాంబో ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ అయింది. మరి SarkaruVari Pata తర్వాత సూపర్ స్టార్ ఈ సూపర్ కాంబోలోనే సినిమా చేస్తాడేమో చూడాలి.