Mahesh Babu’s ‘Sarkaru Vaari Paata’ shoot Updates
సూపర్ స్టార్ మహేష్ బాబు – పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఎండింగ్ స్టేజికి చేరుకుంది. ఇప్పటికే మేజర్ షెడ్యుల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ షెడ్యుల్ జరుపుకుంటుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఇందుకోసం ఫ్లోర్ లో భారీ సెట్ వేశారు.
వందల మంది జూనియర్ ఆర్టిస్టుల నడుమ పదుల సంఖ్యలో ఫైటర్స్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. మహేష్ తో పాటు మరికొందరు నటీ నటులు కూడా పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవ్వనుందని తెలుస్తుంది. మొదటి షెడ్యుల్ లో దుబాయ్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ ఎపిసోడ్ కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని ఇన్సైడ్ టాక్. ఈ షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ ప్యాకప్ చెప్పనున్నారు.
ప్రస్తుతం ఆల్బం నుండి రిలీజయిన ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంటూ భారీ వ్యూస్ తో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ ఆల్బం నుండి రెండో సాంగ్ కూడా త్వరలోనే రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ వరకూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసి మే 12న రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారు.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics