మహేష్ బాబు 25 వ సినిమా – ఇంట్రెస్టింగ్ అప్డేట్స్
Saturday,April 14,2018 - 04:36 by Z_CLU
ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ ఈ నెల 20 న రిలీజవుతున్న ‘భరత్ అనే నేను’ సినిమాపై ఫిక్స్ అయి ఉంది. అయితే మరోవైపు వంశీ పైడిపల్లి & టీమ్ మాత్రం మహేష్ బాబు 25 వ మూవీ ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఆల్మోస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కి ప్యాకప్ చెప్పేసిన సినిమా యూనిట్, సినిమాకి కావాల్సిన లొకేషన్స్ ని ఫిక్స్ చేసుకుంది. మ్యాగ్జిమం U.S. లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో ఈ సినిమాను తెర కెక్కించే ప్రాసెస్ లో ఉన్న ఫిలిమ్ మేకర్స్ ఈ సినిమాని జూన్ కల్లా సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు.
దిల్ రాజు, అశ్వినీ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్సయింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.