ఫిబ్రవరి నుండి మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమా

Sunday,December 03,2017 - 12:03 by Z_CLU

ప్రస్తుతం కొరటాల ‘భరత్ అనే నేను’ మూవీ సెట్స్ పై బిజీ బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. మ్యాగ్జిమం జనవరి కల్లా  షూటింగ్ కి కంప్లీట్  గా ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది కొరటాల టీమ్. అయితే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే తన నెక్స్ట్ సినిమా పనులను  బిగిన్ చేసేశాడు మహేష్ బాబు.

ఫిబ్రవరి కల్లా వంశీ పైడిపల్లి  సినిమాతో సెట్స్ పైకి వచ్చే ఆలోచనలో ఉన్న మహేష్ బాబు, టైమ్ దొరికినప్పుడల్లా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, మ్యాగ్జిమం USA లో షూటింగ్ జరుపుకోనున్న సినిమా టీమ్, ఇప్పటికే లొకేషన్స్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఇకపోతే ఈ సినిమా కోసం ఆల్ రెడీ 3 పాటలను ఫ్రీజ్ చేసుకున్న దేవి శ్రీ ప్రసాద్, తక్కిన సాంగ్స్  కంపోజిషన్ పనుల్లో ఉన్నాడు. దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.