ప్లానింగ్ లో ముందున్న Mahesh , Allu Arjun !

Tuesday,February 09,2021 - 03:17 by Z_CLU

సినిమా ప్రమోషన్స్ లో ఒక్కో హీరో ఒక్కో స్టాటజీ ఫాలో అవుతుంటారు. కొందరు సినిమాకి సంబంధించి విషయాలను చాలా గోప్యంగా ఉంచుతూ రిలీజ్ కి ముందు వదిలే ఫస్ట్ లుక్ వరకు కాన్సెప్ట్ గానీ లుక్ గానీ  రివీల్ అవ్వకుండా చూసుకుంటారు. కానీ మహేష్ బాబు , అల్లు అర్జున్ మాత్రం సెపరేట్ స్టాటజీ ఫాలో అవుతున్నారు.

అవును ‘పుష్ప’ సెట్స్ పైకి వెళ్ళకముందే సినిమాలో తన లుక్ రిలీజ్ చేసి సినిమాపై ముందు నుండే హైప్ క్రియేట్ చేశాడు స్టైలిష్ స్టార్. షూటింగ్ జరుగుతుండగానే రెండు మూడు పోస్టర్స్ వదిలేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా అంతే. సర్కారు వారి పాట ఎనౌన్స్ మెంట్ నుండే స్టోరీ గురించి హింట్స్ ఇస్తూ తన లుక్ ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్స్ తో సినిమాపై బజ్ తీసుకొచ్చి అభిమానుల్లో అంచనాలు నెలకొలుపుతున్నాడు. అంతే కాదు రిలీజ్ కి ముందే టైటిల్ సాంగ్ నుండి బిట్ కూడా వదిలేసి సూపర్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు.

ఇలా ఈ రెండు సినిమాలను ఓ కొత్త ప్రమోషన్ స్టాటజీతో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఇద్దరు హీరోలు. బన్నీ ‘పుష్ప’ ఆగస్టులో థియేటర్స్ లోకి వస్తుండగా మహేష్ ‘సర్కారు వారి పాట’ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది.

Also Check గోపీచంద్ తో మరోసారి రాశీ ఖన్నా ?