మహేష్ 25వ సినిమా ప్రారంభం

Monday,August 14,2017 - 11:19 by Z_CLU

కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రాన్ని ప్రారంభించాడు మహేష్ బాబు. ఈరోజు ఉదయం ఈ సినిమా ముహూర్తం షాట్ తో ప్రారంభమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఎప్పట్లానే సినిమా ముహూర్తం షాట్ కు మహేష్ ఎటెండ్ కాలేదు. మహేష్ తరపున నమ్రతా హాజరయ్యారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు. డీజే బ్యూటీ పూజా హెగ్డేను తీసుకునే అవకాశాలున్నాయి. ఇక మ్యూజిక్ డైరక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ను తీసుకున్నారు. త్వరలోనే సాంకేతిక నిపుణుల వివరాల్ని, సినిమా సెట్స్ పైకి వచ్చే తేదీని ఎనౌన్స్ చేస్తారు.

ప్రస్తుతం లక్నోలో ఉన్నాడు మహేష్. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. ఈనెల 22 వరకు ఆ షెడ్యూల్ కొనసాగుతుంది. భరత్ అనే నేను సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే వంశీ పైడిపల్లి సినిమా స్టార్ట్ అవుతుంది.