ఢిల్లీలో మహానటి షూటింగ్

Thursday,November 02,2017 - 11:40 by Z_CLU

మొన్నటివరకు రామోజీ ఫిలింసిటీలో జరిగిన మహానటి షూటింగ్ తాజాగా ఢిల్లీకి షిఫ్ట్ అయింది. సినిమాలో సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తిసురేష్, జెమినీ గణేశన్ పాత్ర పోషిస్తున్న దుల్కర్ సల్మాన్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది ఆర్టిస్టులు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

లాస్ట్ వీక్ వరకు రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఎస్వీ రంగారావు పాత్ర పోషిస్తున్న మోహన్ బాబుపై మాయాబజార్ సినిమా సన్నివేశాలు తెరకెక్కించారు. అంతకంటే ముందు జరిగిన మరో షెడ్యూల్ లో కీర్తిసురేష్ పై ఇంకొన్ని కీలకమైన సీన్స్ తీశారు. అలా గ్యాప్ లేకుండా మహానటి షూటింగ్ కొనసాగుతూనే ఉంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్.. ఇలా చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రియాంక దత్ నిర్మాత.