ప్రభాస్ సినిమాకు 'మహానటి' టచ్
Saturday,January 30,2021 - 04:28 by Z_CLU
ప్రభాస్, దీపిక పదుకొణె జంటగా ఒక అద్భుతమైన సినిమా అనుభవాన్ని ఇచ్చేందుకు అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సిద్ధమవుతోంది. ‘మహానటి’తో తెలుగు చిత్రసీమలోని ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ చేయనున్నారు.
వైజయంతీ మూవీస్, నాగ్ అశ్విన్ కలయికలో వచ్చిన ‘మహానటి’ పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది. ఆ చిత్రానికి తెర వెనుక హీరోలుగా నిలిచిన ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ప్రభాస్, దీపిక, నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ కాంబినేషన్ చిత్రానికి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. వారిలో ఒకరు సినిమాటోగ్రాఫర్ డానీ సాంచెజ్-లోపెజ్ కాగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె. మేయర్.
‘మహానటి’ చిత్ర విజయంలో మిక్కీ జె. మేయర్, డానీ సాంచెజ్-లోపెజ్ పోషించిన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆ ఇద్దరినీ ప్రభాస్ మూవీ కోసం కూడా తీసుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
2022లో ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ససినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటించనుంది.