షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మహానటి

Thursday,March 22,2018 - 08:29 by Z_CLU

మహానటి షూటింగ్ కంప్లీట్ అయింది. సమంతా జర్నలిస్ట్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహానటి సావిత్రి రోల్ లో కీర్తి సురేష్ నటించింది. అయితే ఈ రోజు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో, కీర్తి సురేష్ ఇమోషనల్ గా ఫీల్ అవుతున్నానని ట్వీట్ చేసింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, షాలిని పాండే, మోహన్ బాబు సినిమాలోని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ కోసం అలనాటి క్లాసిక్ సాంగ్ వివాహ భోజనంబు పాటతో పాటు, అప్పటి సెట్ ను రీక్రియేట్ చేయడం సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది.  

తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన సావిత్రి గురించి అభిమానులకు తెలియని ఇంట్రెస్టింగ్ ఇమోషనల్ అంశాలతో తెరకెక్కుతుందీ సినిమా. మిక్కీ జే. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి స్వప్నదత్ నిర్మాత. మే 9 న ఈ సినిమా రిలీజవుతుంది.