నాగచైతన్య ‘సవ్యసాచి’ లో మాధవన్

Tuesday,September 26,2017 - 02:40 by Z_CLU

యుద్ధం శరణం తరవాత నాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్ లో మోస్ట్ ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో సెట్స్ పైకి రానున్న ‘సవ్యసాచి’ ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో హీరో మాధవన్ కీ రోల్ ప్లే చేయనున్నారనే టాక్ టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఓ కీ రోల్ ప్లే చేయడానికి సినిమా యూనిట్, మాధవ్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది. మాధవన్ కూడా ఈ ఆఫర్ కి పాజిటివ్ గానే రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. మాధవన్ ఈ సినిమాలో విలన్ గా నటించనున్నాడా..? లేకపోతే సినిమాపై హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్పెషల్ రోల్ ప్లే చేయనున్నాడా అనే క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాని మ్యాగ్జిమం అక్టోబర్ సెకండ్ వీక్ కల్లా సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.