రన్ టైమ్ లాక్ చేసుకున్న చిరు , బాలయ్య

Thursday,January 05,2023 - 02:35 by Z_CLU

Lengthy Run time fixed for ‘Waltair Veerayya’ , ‘Veerasimha Reddy’

సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్న చిరు (Chiranjeevi) , బాలయ్య (NBK) లు తమ సినిమాలకు రన్ టైమ్ లాక్ చేసుకున్నారు. జనవరి 12 న , జనవరి 13న రిలీజ్ కి రెడీ అవుతున్న వీరసింహా రెడ్డి (Veerasimhareddy) , వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) సినిమాలకు సంబంధించి తాజాగా సెన్సార్ పూర్తయింది. రెండు సినిమాలకు రన్ టైమ్ లాక్ అయిపోయింది.

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు రెండు గంటల నలబై నిమిషాల రన్ టైమ్ లాక్ చేశారు. బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ కి రెండు గంటల నలబై తొమ్మిది నిమిషాల రన్ టైమ్ లాక్ చేసుకున్నారు. రన్ టైమ్ పరంగా చిరంజీవి కంటే బాలయ్య ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. వీరయ్య రెండున్న గంటలకు ఇంకో పది నిమిషాలు ఎక్కువ ఉండనుంది. వీర సింహా రెడ్డి మాత్రం పది నిమిషాలు తక్కువ మూడు గంటలు ఉండబోతుంది.

సంక్రాంతి సినిమాలు ఈ లెంగ్త్ డిమాండ్ చేయడంతో మేకర్స్ కూడా కొన్ని డిస్కషన్స్ పెట్టుకొని ఫైనల్ గా ఈ రన్ టైమ్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నుండి రాబోతున్న ఈ రెండు సంక్రాంతి బడా సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలు అందుకుంటాయో చూడాలి.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics