హాకీ నేర్చుకుంటున్న లావణ్య త్రిపాఠి

Saturday,February 22,2020 - 01:47 by Z_CLU

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఒకటి… ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. రెండు… ‘చావు కబురు చల్లగా…!’ సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ హాకీ నేపథ్యంలో రూపొందుతోంది. అందులో లావణ్యా త్రిపాఠి హాకీ ప్లేయర్ గా కనిపించనుంది.

క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం హాకీ ప్రాక్టీస్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ ఒక్క రోజు కూడా హాకీ శిక్షణకు డుమ్మా కొట్టడం లేదు. తెలుగు సినిమాలతో పాటు ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి ఒక తమిళ సినిమా కూడా చేస్తోంది. రోజంతా చెన్నైలో తమిళ సినిమా షూటింగ్ చేసి, నైట్ ఫ్లయిట్ క్యాచ్ చేసి హైదరాబాద్ వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ హాకీ ప్రాక్టీస్ చేసి, మళ్లీ చెన్నై వెళ్లి తమిళ సినిమా షూటింగ్ చేస్తోంది.

ఈమధ్య ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’తో పాటు లావణ్యా త్రిపాఠి నటిస్తున్న మరో తెలుగు సినిమా ‘చావు కబురు చల్లగా…!’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పతాకంపై కార్తికేయ హీరోగా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ సంస్థలో ‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాల తర్వాత లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సినిమా ఇది. డార్క్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకూ చేయనటువంటి పాత్రలో ఆమె కనిపించనున్నారు.