లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఏపీ రిలీజ్ కు లైన్ క్లియర్

Saturday,April 27,2019 - 10:15 by Z_CLU

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆల్రెడీ తెలంగాణతో పాటు ఓవర్సీస్ లో విడుదలైంది. కానీ ఎలక్షన్ కోడ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విడుదల కాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. మే 1న ఈ సినిమా ఏపీ అంతటా రిలీజ్ అవుతుందని వర్మ ప్రకటించాడు.

ఎన్టీఆర్ వెనక జరిగిన కుట్రలు తెలుసుకోవాలంటే తప్పకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడాలంటున్నాడు వర్మ. ఈ సినిమాను లక్ష్మీ పార్వతి యాంగిల్ లో తీసిన వర్మ, ఎన్టీఆర్ చివరి దశలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ఇందులో చూపించాడు.

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ప్రేక్షకులు ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసేశారు. దీనికి తోడు సినిమాకు సంబంధించి చాలా క్లిప్పింగులు సోషల్ మీడియాలో వచ్చేశాయి. ఇలాంటి టైమ్ లో థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఎవరు చూస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.