నిఖిల్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్
Wednesday,March 18,2020 - 03:36 by Z_CLU
సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ’18 పేజెస్’ సినిమా చేస్తున్నాడు నిఖిల్. సుకుమార్ కథ -స్క్రీన్ ప్లే తో తెరకెక్కనున్నఈ సినిమా ఈమధ్యే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఏప్రిల్ నెలాఖరు నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఇప్పుడీ ప్రాజెక్టులో హీరోయిన్ ను ఫైనలైజ్ చేశారు.
’18 పేజెస్’లో నిఖిల్ సరసన కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె ‘ఉప్పెన’ సినిమా చేస్తోంది. ఇదే ఆమెకు తొలి తెలుగు సినిమా. ఇదింకా థియేటర్లలోకి రాకముందే, మరో ప్రతిష్టాత్మక సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కృతి షెట్టి.
అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నివాసు నిర్మాతగా గతంలో వచ్చిన భలే భలే మగాడివోయ్, గీతగోవిందం, ప్రతిరోజు పండగే సినిమాలు బ్లాక్బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడీ కాంబినేషన్ కు సుకుమార్ కూడా యాడ్ అవ్వడంతో ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి. కృతి షెట్టి రాకతో 18 పేజెస్ మరింత కలర్ ఫుల్ గా మారింది.