ఆ సినిమా తర్వాత ఆ హీరోతోనే

Sunday,June 04,2017 - 11:05 by Z_CLU

మొన్నామధ్య టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వార్త గట్టిగానే చక్కర్లు కొట్టింది. అందరినీ అవాక్కయేలా చేసి హాట్ టాపిక్ గా అయినా ఆ కాంబో మరెవరిదో కాదు వెంకటేష్-క్రిష్ జాగర్లమూడి కాంబో. నిజానికి వీరిద్దరిది విభిన్న స్టయిల్.. కానీ ఇద్దరి తీరు ఒకటే. ఇద్దరు ఏదో కొత్తదనంతో సినిమా చేయాలనీ ప్రతీ సారి విభిన్న కథలను ఎంచుకుంటుంటారు. అందుకే ఈ కాంబినేషన్ లో సినిమా రానుందని వార్త టాలీవుడ్ లో కాస్త బజ్ క్రియేట్ చేసింది.

అయితే ముందుగా ఈ వార్తలో నిజం లేదని ఇది కేవలం గాసిప్ మాత్రమే అనే టాక్ వినిపించింది.. కానీ ఓ ఇంటర్వ్యూ లో వెంకీ క్రిష్ తో ఓ సినిమా చేయనున్నట్లు వస్తున్న వార్త నిజమే అని కానీ దానికి కథ ఇంకా కుదరలేదని త్వరలోనే క్రిష్ తో ఓ సినిమా చేస్తానని చెప్పడంతో ఈ కాంబో మరో సారి హాట్ టాపిక్ అయింది. గౌతమి పుత్ర శాతకర్ణి తో దర్శకుడిగా గొప్ప గుర్తింపు అందుకున్న క్రిష్ వెంకీ తోనే నెక్స్ట్ సినిమా చేస్తాడేమో అనుకున్నారంతా. కానీ క్రిష్ మాత్రం కంగనా ప్రధాన పాత్రలో రాణి జాన్సీ లక్ష్మి భాయ్ కథ తో తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ అనే సినిమాను స్టార్ట్ చేసి ఆ సినిమాను సెట్స్ అపి పెట్టేశాడు. ప్రస్తుతం ‘మణి కర్ణిక’ సినిమాతో బిజీ గా ఉన్న క్రిష్ ఈ సినిమా తర్వాత వెంకీ తో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడని కుదిరితే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది వీళ్ళ కాంబోలో తెరకెక్కే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం..