పవన్ కోసం కథ రాస్తున్న క్రిష్

Wednesday,October 02,2019 - 12:02 by Z_CLU

పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి వస్తాడా రాడా అనే విషయం ఎవరికీ తెలియదు. ఆయన రీఎంట్రీ ఉంటుందని అభిమానులు అంటున్నారు. ఉండకపోవచ్చని పొలిటికల్ సర్కిల్ అంటోంది. కానీ డైరక్టర్లు మాత్రం ఇవేం పట్టించుకోవడం లేదు. పవన్ కోసం కథలు వండుతూనే ఉన్నారు. వీళ్లలో క్రిష్ అందరికంటే ముందున్నాడు.

పవన్ కోసం టోటల్ స్క్రీన్ ప్లే రాసే పనిలో క్రిష్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఆఫ్ ది రికార్డ్ అతడు కన్ ఫర్మ్ చేశాడు కూడా. రీసెంట్ గా పవన్ ను కలిసిన క్రిష్ అతడికి లైన్ వినిపించాడు. ఆ స్టోరీలైన్ పవన్ కు బాగా నచ్చింది. డెవలప్ చేయమని చెప్పాడట. అందుకే క్రిష్ ఇప్పుడు ఆ పనిలో పడ్డాడు.

నిజానికి క్రిష్ ఒక్కడే కాదు, మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా పవన్ కు లైన్ వినిపించారు. వాళ్లకు దక్కని గ్రీన్ సిగ్నల్ క్రిష్ కు మాత్రమే దక్కింది. సో.. పవన్ రీఎంట్రీ పక్కా అంటూ మరోసారి గాసిప్స్ ఊపందుకున్నాయి.

పొలిటికల్ గా బిజీ అయినప్పటికీ టాలీవుడ్ కు దగ్గరగానే ఉంటున్నాడు పవన్. ఫ్రెండ్ త్రివిక్రమ్ తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నాడు. రీసెంట్ గా సైరా సినిమాకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. ఇలా మెల్లగా సినీ యాక్టివిటీస్ పెంచి, ఆ తర్వాత రీఎంట్రీని ప్రకటిస్తాడేమో చూడాలి.