ఆగస్ట్ 23న ప్రపంచవ్యాప్తంగా 'కౌసల్య కృష్ణమూర్తి' రిలీజ్
Friday,August 02,2019 - 10:01 by Z_CLU
ఐశ్వర్యా రాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో, కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్’. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ”భీమనేని శ్రీనివాసరావు చేసిన ఓ మంచి సినిమా. ఐశ్వర్యా రాజేష్ అనే మంచి నటిని తీర్చిదిద్దిన సినిమా ఈ ‘కౌసల్య కృష్ణమూర్తి’. ఎంతో గొప్పగా నటించిన రాజేంద్రప్రసాద్ ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్.” అన్నారు.
దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ”ఈ సినిమా ఆడియో చాలా పెద్ద హిట్ అయ్యింది. ముఖ్యంగా ‘ముద్దాబంతి పూవు ఇలా..’ అనే పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్స్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ఆగస్ట్ 23న వరల్డ్వైడ్గా మా సినిమా విడుదలవుతుంది” అన్నారు.