ప్రభాస్ 22 కూడా ఫిక్స్ ?

Sunday,March 01,2020 - 02:05 by Z_CLU

ప్రస్తుతం రాధా కృష్ణ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు. తన 21వ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు ప్రభాస్. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానున్న వీరిద్దరి సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనిదత్ నిర్మించనున్నాడు.

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకూ ప్రభాస్ 22వ సినిమా కూడా కన్ఫర్మ్ అయిందట. నాగ్ అశ్విన్ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివతో ప్రభాస్ సినిమా చేస్తాడని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘మిర్చి’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సో ఈ కాంబో సినిమాపై ఆటోమేటిక్ గానే భారీ అంచనాలు ఏర్పడతాయి. ‘మిర్చి’ నిర్మించిన యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుందని తెలుస్తుంది.