ఈరోజు నుంచే కిట్టు హంగామా షురూ

Monday,February 13,2017 - 09:35 by Z_CLU

రాజ్ తరుణ్ నయా మూవీ కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. దీనికి తోడు ట్రయిలర్ సూపర్ హిట్ అవ్వడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. ఈ అంచనాలను మరింత పెంచాలని నిర్ణయించుకుంది టీం. అందుకే ఇవాళ్టి నుంచి పాటల్ని విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయించిందది. ఇందులో భాగంగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. అర్థమైందా అనే సాహిత్యంతో సాగే పాటను ఈరోజు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు విడుదల చేయబోతున్నారు.

రాజ్ తరుణ్ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ కృష్ణ దర్శకుడు. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. మరీ ముఖ్యంగా రాజ్ తరుణ్ ఇందులో కుక్కల దొంగగా కనిపించబోతున్నాడు. అదే సినిమాకు పెద్ద హైలెట్ గా మారనుంది.