సితార బ్యానర్ లో కిరాక్ పార్టీ దర్శకుడి సినిమా

Thursday,March 08,2018 - 11:23 by Z_CLU

కిరాక్ పార్టీ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు శరణ్ కొప్పిశెట్టి. ఆ మూవీ తర్వాత శరణ్ చేయబోయే సినిమా వివరాలు బయటకొచ్చాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు శరణ్. కిరాక్ పార్టీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా డీటెయిల్స్ బయటకొస్తాయి.

నిజానికి తన మొదటి సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పైనే చేయాలనుకున్నాడు శరణ్ కొప్పిశెట్టి. అప్పటికే నిర్మాత నాగవంశీకి కథ కూడా వినిపించాడు. కానీ అంతలోనే కిరాక్ పార్టీ రీమేక్ ఆఫర్ రావడంతో ముందుగా దీన్ని స్టార్ట్ చేశాడు. అలా కిరాక్ పార్టీతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.

నిఖిల్ హీరోగా తెరకెక్కింది కిరాక్ పార్టీ. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరిన్జా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది ఈ సినిమా.