ఇద్దరు హీరోల మధ్యలో...

Saturday,November 19,2016 - 09:30 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల కొరత ఉంది. ఇందుకోసమే అప్పుడప్పుడూ బాలీవుడ్, కోలీవుడ్ వైపు చూస్తుంటారు మన స్టార్ హీరోలు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల కన్ను కోలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ పై పడింది. ‘నేను శైలజ’ చిత్రం తో కథానాయికగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్ కు వరుస పెట్టి బడా ఆఫర్స్ ఇస్తున్నారు మన బడా హీరోలు.

keerthy-suresh

ప్రస్తుతం నాని సరసన ‘నేను లోకల్’ సినిమాలో నటిస్తున్న కీర్తి… తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు హీరోయిన్ గా సెలక్ట్ అయింది. ఇదిలాఉండగా మరో స్టార్ హీరో సినిమాలో కూడా కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఆ సినిమా ఇంకోదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ – కొరటాల శివ కాంబోలో రాబోతున్న మూవీ. ఇప్పటికే ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేశారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సెట్స్ పై మహేష్-మురుగదాస్ సినిమా కోసం కూడా కీర్తి పేరును పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి మహేష్ మూవీ కోసం కీర్తి సురేష్ పేరును లిస్ట్ అవుట్ చేశారట. ఈ వార్త నిజమైతే కనుక ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో నటించి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు అందుకోవడం ఖాయం.