మన్మధుడి కొత్త జోడీ... కీర్తి సురేష్

Wednesday,June 05,2019 - 02:12 by Z_CLU

నిన్నటి నుండే ‘మన్మధుడు 2’ సెట్స్ పైకి వచ్చేసింది కీర్తి సురేష్. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉంటుందని బిగినింగ్ నుండే టాక్ ఉన్నా.. రీసెంట్ గా ఆ హీరోయిన్ కీర్తి సురేష్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని వినిపిస్తున్నా, ఈ న్యూస్ కన్ఫమ్ అయింది మాత్రం నిన్ననే… సెట్స్ పై ఉన్న మానిటర్ షాట్ ని షేర్ చేస్తూ… ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫమ్ చేశాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్…

మ్యాగ్జిమం సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ లో కీర్తి సురేష్ ఉండే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇకపోతే  సినిమాలో కీర్తి సురేష్ రోల్ జస్ట్ కామియో మాత్రమే అని తెలుస్తుంది. అయినా స్క్రీన్ పై కనిపించబోఎది కాసేపే అయినా, వీరిద్దరి కాంబినేషన్ లో ఉండబోయే ఆ మ్యాజికల్  మూమెంట్స్ చుట్టూ..  సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్  హీరోయిన్ గా నటిస్తుంది. సమంతా సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజర్. నాగార్జున అక్కినేని, P. కిరణ్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు.