మహానటి ‘మూగమనసులు’ సింగిల్ ఇంప్రెస్ చేస్తుంది

Friday,April 20,2018 - 06:49 by Z_CLU

మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మహానటి’ ఫస్ట్ సింగిల్ రిలీజయింది. ‘మూగమనసులు’ అంటూ సాంగే ఈ సాంగ్ సీనియర్ నటి సావిత్రి లైఫ్ లోని రొమాంటిక్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తుంది. శ్రియ ఘోషాల్, అనురాగ్ కులకర్ణి కలిసి పాడిన ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ కాన్సంట్రేటెడ్ ఎలిమెంట్ లా మారింది.

స్లో పేజ్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ప్రతి అక్షరం అద్భుతంగా రీచ్ అయ్యేలా పాటను కంపోజ్ చేశాడు మిక్కీ జె. మేయర్. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో ఉండబోయే ఈ సాంగ్, రియల్ లైఫ్ లో నటి సావిత్రి, జెమినీ గణేషన్ మధ్య ఉండే అన్యోన్యతను ఎలివేట్ చేస్తుంది. కేవలం సాంగ్ నే రిలీజ్ చేయకుండా ఈ లిరికల్ వీడియో లో సాంగ్ మేకింగ్ వీడియో విజువల్స్ అటాచ్ చేయడంతో ఈ సాంగ్ మరింతలా ఎట్రాక్ట్ చేస్తుంది.

మిక్కీ జె. మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రీసెంట్ గా టీజర్ తో ఇంప్రెస్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ ఫస్ట్ సింగిల్ ‘మహానటి’ తో మరింతగా మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ సినిమా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. మే 9 న ఈ సినిమా రిలీజవుతుంది.