టాలీవుడ్ లో కత్రినాకైఫ్ రీఎంట్రీ

Saturday,January 05,2019 - 01:01 by Z_CLU

కత్రినాకైఫ్ కు తెలుగు సినిమా కొత్తకాదు. కెరీర్ స్టార్టింగ్ లో వెంకటేశ్, బాలకృష్ణ లాంటి బడా హీరోల సరసన ఆమె సినిమాలు చేసింది. అయితే ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైపోయింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది.

మహేష్ అప్ కమింగ్ మూవీ కోసం కత్రినాకైఫ్ ను సంప్రదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమాకు కమిట్ అయ్యాడు మహేష్. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులోనే కత్రినాకైఫ్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది కత్రినాకైఫ్. కేవలం A-గ్రేడ్ హీరోలకు మాత్రమే ఆమె కాల్షీట్లు దొరుకుతాయి. అలాంటి హీరోయిన్ తెలుగులోకి వస్తుందా? మహేష్ మూవీకి కాల్షీట్లు ఇస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.