మరో "ఖైదీ" ముస్తాబయ్యాడు
Tuesday,October 15,2019 - 04:13 by Z_CLU
యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న సినిమా ‘ఖైదీ’. ఈ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ను లోకేష్ కనకరాజ్ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడీ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను కేకే రాధామోహన్ దక్కించుకున్నారు.
శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ”రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వుండే సినిమా ఇది. పాటలు, హీరోయిన్ లేకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో సాగే వెరైటీ సినిమా ఇది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది.” అన్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈమధ్య రిలీజైంది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇందులో సాంగ్స్, రొమాన్స్ లాంటివి ఉండవు. పూర్తిగా యాక్షన్-థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే డిఫరెంట్ మూవీ ఇది. ఈ మూవీని చూసి డెఫినెట్ అందరూ థ్రిల్ అవుతారని అంటున్నారు మేకర్స్.