చావు కబురు చల్లగా.. కార్తికేయ న్యూలుక్
Saturday,May 02,2020 - 11:03 by Z_CLU
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా చావు కబురు చల్లగా. లాక్ డౌన్ కు ముందే మెదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. రొమాంటిక్ డార్క్ హ్యూమర్ జానర్ లో ఈ సినిమా వస్తోంది.
ఈ చిత్రంలోని ప్రతి పాత్ర చాలా నేచురల్ గా ప్రతి ఒక్కరి జీవితాలకి దగ్గరగా ఉంటుందంటున్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి తాజాగా వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు.
అల్లు అరవింద్ సమర్పణలో GA2 బ్యానర్ పై బన్నివాసు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో కౌశిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చావుకబురు చల్లగా అనే టైటిల్ కు ఈ సినిమా కథకు చాలా ఇంట్రెస్టింగ్ లింక్ ఉందంటున్నాడు డైరక్టర్.
ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.. అలాగే ప్రముఖ కెమెరామెన్ సునీల్ రెడ్డి తన సినిమాటొగ్రఫి ని అందిస్తున్నారు. సినిమాలో ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బ్యానర్ : GA2 pictures
సమర్పణ : అల్లు అరవింద్
సంగీతం.. జేక్స్ బిజోయ్
కెమెరా.. సునీల్ రెడ్డి,
ప్రోడక్షన్ డిజైనర్.. మనీషా ఏ దత్
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. రాఘవ కరుటూరి
ఎడిటర్.. సత్య
నిర్మాత : బన్నీ వాసు
డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి