సెట్స్ పైకి వచ్చిన కళ్యాణ్ రామ్ కొత్త సినిమా

Wednesday,May 02,2018 - 02:08 by Z_CLU

K.V. గుహన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఈ రోజు సెట్స్ పైకి వచ్చేసింది. థ్రిల్లింగ్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

రీసెంట్ గా రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ K.V. గుహన్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన నివేత థామస్, షాలినీ పాండే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నట్టు తెలుస్తుంది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మరోవైపు కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన ‘నా నువ్వే’ మే 25 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.