కళ్యాణ్ రామ్ నమ్మకం అదే..

Sunday,April 16,2017 - 02:00 by Z_CLU

కళ్యాణ్ రామ్ నిర్మతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు విభిన్న క్యారెక్టర్స్ లో నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ సరసన రాశి కన్నా, నివేత థామస్ హీరోయిన్ గా నటిస్తున్నారు..

Jr NTR Jai Lava Kusa

ఈ సినిమా కోసం నిర్మాతగా ఇప్పటి వరకూ ఖర్చు చేయని భారీ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నాడట కళ్యాణ్ రామ్. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సంబంధించి రూ.50 కోట్లు పైనే బడ్జెట్ కేటాయించాడని, తన బ్యానర్ లో తారక్ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా కావడం, పైగా కథ పై భారీ నమ్మకం ఉండడంతో ఈ సినిమా విషయంలో నిర్మాతగా ఎలాంటి రాజీ పడకుండా ఇంపార్టెంట్ సీన్స్ తో పాటు సాంగ్స్ కి కూడా భారీ సెట్స్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. మరి కళ్యాణ్ రామ్ నమ్మకంతో ఈ భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ తరువాత ఏ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొడుతుందో..చూడాలి..