కాజల్ తో కాజల్.. మైనపు బొమ్మ ఆవిష్కరణ

Wednesday,February 05,2020 - 03:36 by Z_CLU

ఫొటో చూశారుగా.. కాజల్ పక్కన కాజల్ నిల్చుంది. ఎవరు ఇందులో ఒరిజినల్ అనేది చెప్పడం చాలా కష్టం. ఇందులో ఒకటి రియల్ కాజల్ అయితే, ఇంకోటి కాజల్ మైనపు విగ్రహం. ఈరోజు సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

తన wax statue ఆవిష్కరణకు కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ వెళ్లింది కాజల్. తన మైనపు బొమ్మ పక్కన నిల్చొని ఫొటోలకు పోజులిచ్చింది. ఇంతకుముందు ఇదే మ్యూజియంలో మహేష్ బొమ్మ పెట్టారు. ఇప్పుడు కాజల్ కూడా అక్కడ కొలువుదీరింది.

సౌత్ నుంచి ఇలా టుస్సాడ్స్ మ్యూజియంలో ఓ హీరోయిన్ కు చోటు దక్కడం ఇదే ఫస్ట్ టైమ్. న్యూ ఇయర్ ఈ న్యూ ఎఛీవ్ మెంట్ కు హ్యాపీగా ఫీలవుతోంది కాజల్.