జై లవకుశ.. కౌంట్ డౌన్ స్టార్ట్

Wednesday,July 05,2017 - 12:16 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న  సినిమా జై లవకుశ. రేపట్నుంచి ఈ సినిమా ప్రచారానికి అఫీషియల్ కౌంట్ డౌన్ ప్రారంభంకానుంది. అవును.. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటల 22 నిమిషాలకు జై లవకుశ టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ తో ఇప్పటికే హల్ చల్ చేసిన ఈ సినిమా.. టీజర్ తో ఆ అంచనాల్ని మరింత పెంచబోతోంది.

జై లవకుశ సినిమాకు సంబంధించి టీజర్ ఇప్పటికే ఆన్ లైన్ లో లీక్ అయింది. అత్యుత్సాహం కొద్దీ కొందరు ఈ సినిమా టీజర్ ను ముందే సోషల్ మీడియాలో లీక్ చేశారు. దీంతో కొందరు ఈ టీజర్ చూసేశారు. దీనిపై నిర్మాత కల్యాణ్ రామ్ పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చాడు. అదే టీజర్ ను రేపు అఫీషియల్ గా రిలీజ్ చేయబోతున్నారు.

బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలవకుశ సినిమాలో నివేత థామస్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 21న జై లవకుశ రిలీజ్ కానుంది.