#Gopichand30 పదిహేనేళ్ళ తర్వాత మళ్ళీ

Sunday,February 13,2022 - 11:03 by Z_CLU

ఈ ఏడాది జులై తో గోపీచంద్ -జగపతి బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘లక్ష్యం’ రిలీజై పదిహేనేళ్ళవ్వనుంది. 2007 లో విడుదలై సూపర్ హిట్టయిన ఈ సినిమాకు శ్రీ వాస్ డైరెక్టర్. ఆ సినిమా తర్వాత గోపీచంద్ -శ్రీవాస్ కలిసి ‘లౌక్యం’ సినిమా చేశారు. మళ్ళీ ఇప్పుడు  శ్రీవాస్ డైరెక్షన్ లో గోపీచంద్ మూడవ సినిమా చేస్తున్నాడు. #Gopichand30 గా తెరకెక్కనున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ఇటివలే రిలీజ్ చేశారు. హైదరాబాద్ నుండి కలకత్తాకి లింక్ ఉండే కథ అన్నట్టుగా హింట్ ఇచ్చారు. తాజాగా రెండు రోజులు షూట్ చేశారు. ఈ నెల ఇరవై నుండి షెడ్యుల్ స్టార్ట్ స్టార్ట్ అవ్వనుంది.  మైసూర్ , కలకత్తా , హైదరాబాద్ లో షెడ్యుల్స్ జరగనున్నాయి.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్ర చేయనున్నట్లు తెలిపారు. గోపీచంద్ -జగపతి బాబు -శ్రీవాస్ కాంబినేషన్ లో ‘లక్ష్యం’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ళకి పదిహేనేళ్ళ తర్వాత ఈ కాంబోలో సినిమా రానుంది. అయితే సినిమాలో జగ్గుబాయి రోల్ ఏంటనేది ఇంకా చెప్పలేదు మేకర్స్.

‘లక్ష్యం’లో గోపీచంద్ కి అన్నయ్యగా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించదు జగపతి బాబు. మరి ఇందులో ఎలాంటి రోల్ చేయబోతున్నాడనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు. త్వరలోనే హీరోయిన్ ని ఫైనల్ చేసి మరో అప్డేట్ ఇవ్వనున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics