వీళ్లు ముగ్గురు జాతిరత్నాలు అంట!

Thursday,October 24,2019 - 01:44 by Z_CLU

స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ `జాతిర‌త్నాలు`. మ‌హాన‌టి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శ‌కుడు నాగ్అశ్విన్ ఈ చిత్రంతో నిర్మాత‌గా మారుతున్నారు. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. అనుదీప్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఇందులో న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ఖైదీల్లా కనిపిస్తున్నారు. 420, 210, 840 వారి నెంబ‌ర్స్‌. అంటే.. 420 కంటే కొంచెం తక్కువగా ఒకరు, 420 కంటే ఎక్కువ మరొకరు అన్నమాట. ఈ డిఫరెంట్ కామెడీ ఎంటర్ టైనర్ కు జాతిరత్నాలు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 75 శాతం పూర్తయింది. ర‌ధ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సిద్ధాన్ మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు.

న‌టీన‌టులు:
న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, ఫ‌రియా అబ్దుల్లా, ముర‌ళీశ‌ర్మ‌, వి.కె.న‌రేశ్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, మిర్చి కిర‌ణ్, గిరిబాబు, మహాన‌టి ఫేమ్ మ‌హేష్‌

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనుదీప్ కె.వి
నిర్మాత‌: నాగ్ అశ్విన్‌
బ్యాన‌ర్‌: స్వ‌ప్న సినిమా
కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్ష గార‌పాటి
మ్యూజిక్‌: ర‌ధ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: సిద్ధాన్ మ‌నోహార్‌
ఎడిట‌ర్‌: అభిన‌వ్ దండ‌
ఆర్ట్‌: చ‌ంద్రిక‌.జి, ఫైస‌ల్ అలీ ఖాన్‌