సెన్సేషనల్ డైరెక్టర్ .. తెలుగు ఎంట్రీ కన్ఫర్మ్ !

Tuesday,June 04,2019 - 05:18 by Z_CLU

కన్నడ సినిమా ‘కే జీ ఎఫ్’ తో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ తెలుగు ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ప్రశాంత్ అసలు తెలుగులో సినిమా చేస్తాడా అనే ప్రశ్నలకు పులిస్టాప్ పెట్టేసారు నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈరోజు ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా మైత్రి నిర్మాతలు “మా సెన్సేషనల్ డైరెక్టర్ కి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టర్ తో విషెస్ తెలిపారు.

బర్త్ డే పోస్టర్ ద్వారా తమ బ్యానర్ లోనే ప్రశాంత్ తెలుగు ఎంట్రీ ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్.. ఆ సినిమా పూర్తయి విడుదలయ్యాకే తెలుగులో సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరి తెలుగులో ప్రశాంత్ డైరెక్ట్ చేయబోయే హీరో ఎవరో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.