ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన కాజల్

Monday,March 23,2020 - 12:54 by Z_CLU

ఆచార్య సినిమాలో కాజల్ ను తీసుకున్నారట
ఈ సినిమా కోసం ఆమె కోటిన్నర తీసుకుందట
ఇలా కాజల్ చుట్టూ వారం రోజులుగా గాసిప్స్ రౌండ్స్ కొడుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు వీటిపై ఈ చందమామ రియాక్ట్ అయింది. ఆచార్య సినిమాలో తను ఉన్నానని, మరోసారి మెగాస్టార్ సరసన నటించబోతున్నానని క్లారిటీ ఇచ్చింది. రెమ్యూనరేషన్ పై మాత్రం రియాక్ట్ అవ్వలేదు.

కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ వాయిదా పడిందని, నెక్ట్స్ ఎప్పుడు షెడ్యూల్ స్టార్ట్ అయితే, ఆ షెడ్యూల్ లో తను ఉంటానని స్పష్టంచేసింది కాజల్. ఇంతకుముందు చిరు-కాజల్ కాంబినేషన్ లో ఖైదీ నంబర్ 150 వచ్చింది. ఇప్పుడు మరోసారి చిరంజీవి సరసన నటించడానికి రెడీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

నిజానికి ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. దర్శకుడు కొరటాల శివ, చెన్నై వెళ్లి మరీ త్రిషకు నెరేషన్ ఇచ్చాడు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆచార్య నుంచి తప్పుకుంటున్నట్టు త్రిష ప్రకటించింది. ఆ వెంటనే కాజల్ సెలక్షన్ పూర్తయింది.