"ఇంతలో ఎన్నెన్ని వింతలో " ట్రైలర్ లాంచ్
Friday,January 12,2018 - 11:03 by Z_CLU
నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో. హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మాతలు. వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహిస్తున్నారు.
నందు హీరోగా సౌమ్య వేణుగోపాల్ నాయికగా పూజ రామచంద్రన్ కీలక పాత్రలలో వస్తున్న చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో ఈ చిత్రం ధియేటరికల్ ట్రైలర్ ని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వి వి వినాయక్ తన మూవీ ఇంటిలిజెంట్ క్లైమాక్స్ లో బిజీ షూటింగ్ జరుగుతున్నా, ఆ సెట్ లో ఇంతలో ఎన్నెన్ని వింతలో మూవీ ధియేటరికల్ ట్రైలర్ ని విడుదల చేసారు.
ఈ సందర్బంగా వి వి వినాయక్ మాట్లాడుతూ.. “నేను, సాయి ధరమ్ మూవీ ఇంటిలిజెంట్ క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉన్నా ఈ మూవీ కి టైమ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఈ చిత్ర దర్శకుడు నా శిష్యుడు వర ప్రసాద్ దర్శకుడిగా మారి ఓ చిత్రం చేస్తున్నాడని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వర ప్రసాద్ మూవీ “ఇంతలో ఎన్నెన్ని వింతలో” మూవీ టాక్ కూడా తెలిసింది చాలా బాగుంది అని విన్నాను. ఇప్పుడు ధియేటరికల్ ట్రైలర్ చూసాను చాలా బాగుంది నా శిష్యుడు వరప్రసాద్ కి మంచి హిట్ వచ్చి పెద్ద హీరోలతో తీసేంతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
ఈ సినిమాను ఫిబ్రవరిలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.