Zee5 లోకి వస్తున్న ‘దొంగ’

Wednesday,August 05,2020 - 07:34 by Z_CLU

వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్పెషల్‌ సినిమాను ZEE5 ఒటీటీ తెలుగు ప్రజల ముందుకు తీసుకొస్తోంది. లాక్‌డౌన్‌లో డైరెక్ట్‌–టు–డిజిటల్‌ ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్‌ సినిమాలు ‘అమృతరామమ్‌’, ‘47 డేస్‌’, ‘బెలూన్‌’, ఇటీవల ఒరిజినల్‌ మూవీ ‘మేక సూరి’ సహా కామెడీ సిరీస్‌ ‘అమృతం ద్వితీయం’, పలు ఒరిజినల్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’, ‘లూజర్’ వంటివి ‘జీ 5’లో విడుదలయ్యాయి. ఇప్పుడీ ఓటీటీలో మరో సినిమా విడుదల కానుంది.


జ్యోతిక, కార్తీ కలిసి నటించిన తొలి చిత్రం ‘దొంగ’. నిజ జీవితంలో వదిన, మరిది అయిన వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. ఆగస్టు 14న ఈ సినిమా ‘ZEE5’లో విడుదల కానుంది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘దొంగ’ వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌కి ‘జీ 5’ సిద్ధమైంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసేఫ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యరాజ్‌ తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో కార్తీ సరసన ‘మేడ మీద అబ్బాయి’, ‘గాయత్రి’ ఫేమ్‌ నిఖిలా విమల్‌ నటించారు.