నన్ను నేను గుర్తించాను – అఖిల్

Monday,December 11,2017 - 11:57 by Z_CLU

టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘హలో’ ఆడియో లాంచ్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది. ‘ఏవేవో కలలు కన్నా… ఏవైపో కదులుతున్నా..’ అంటూ అఖిల్ పాడిన పాట ఈవెంట్ లో హైలెట్ గా నిలిస్తే, ఈ లైవ్ పర్ఫామెన్స్ తరవాత అఖిల్ ఇమోషనల్ స్పీచ్ అక్కినేని ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపేసింది.

‘హలో’ సినిమా బిగిన్ అయినప్పటి నుండి ఈ సినిమాకు పని చేయడం ఒక ఇమోషనల్ జర్నీ’ అని చెప్పుకున్న అఖిల్, ‘హలో… అక్కినేని ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అయ్యేలా ఉండబోతుంది, ఈ సినిమాతో నన్ను నేను గుర్తించాను’ అని ఇమోషనల్ మాట్లాడాడు. సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ‘మెరిసే మెరిసే’ సాంగ్ తో నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేసింది. ఆ తరవాత నిన్న జరిగిన ఆడియో రిలీజ్ తరవాత ఈ ఆల్బం కి సోషల్ మీడియాలో క్రియేట్ అవుతున్న క్రేజ్ చూస్తుంటే, అఖిల్ కరియర్ లో ‘హలో’ మూవీ మైల్ స్టోన్ మూవీగా నిలవడం గ్యారంటీ అనిపిస్తుంది.