Adivi Sesh Major - భారీ సెట్స్ రెడీ
Friday,April 23,2021 - 02:28 by Z_CLU
26/11 ముంబై నగరంలో జరిగిన టెర్రర్ ఎటాక్స్లో తన ప్రాణాలను పణంగా ప్రజలను కాపాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు హీరో అడివి శేష్. అదే మేజర్ మూవీ.
రియల్ ఇన్సిడెంట్స్ను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ శశికిరణ్ తిక్క అండ్ టీమ్ ఈ స్క్రిప్ట్ను
తయారు చేసుకున్నారు.. అందుకు తగినట్లు భారీ సెట్స్ను వేసి సినిమాను చిత్రీకరిస్తున్నారు. మహానటి వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసిన అవినాష్ కొల్ల, మేజర్ సినిమాలోని సన్నివేశాలను రియలిస్టిక్గా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. అందుకోసం ఆరు భారీ సెట్స్ వేశారు.
అందులో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సెట్..ఎన్ఎస్జీ కమాండో సెట్లను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు స్టూడియోలో వేశారు. ఇక ఈ సినిమాకు వేసిన భారీ సెట్స్లో తాజ్ మహాల్ ప్యాలెస్ సెట్ హైలెట్ అని చెప్పొచ్చు. 2008లో జరిగిన టెర్రర్ ఎటాక్ తాజ్ హోటల్లోనే జరిగింది. ఈ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ప్రేక్షకులకు రియల్ లొకేషన్ ఫీలింగ్ కలిగించడానికి రియల్ హోటల్ ఎలా ఉందో అలాంటి సెట్నే అవినాష్ కొల్ల వేశారు.
నిజానికి ముంబైలోని తాజ్ హోటల్లో సన్నివేశాలను చిత్రీకరించాలని యూనిట్ అనుకున్నప్పటికీ వారికి పర్మిషన్ దొరక్కపోవడంతో, సెట్ను వేశారు. నాలుగైదు రోజుల పాటు చిత్ర యూనిట్ తాజ్ హోటల్ ఆర్కిటెక్చర్ను పరిశీలించారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా సునిశితంగా పరిశీలించడమే కాకుండా, సెట్ను వేయడానికి ఎంతో రీసెర్చ్ చేశారు. ఐదు వందల మంది దాదాపు పది రోజుల పాటు శ్రమించి ఈ భారీ సెట్ను నిర్మించారు.
తాజ్లో గ్రాండ్ స్టెయిర్ కేస్, టాటా ఐకానిక్ ఇమేజ్, ఎం.ఎఫ్.హుస్సేన్ పెయిటింగ్స్ వంటి వాటిని రీ క్రియేట్ చేశారు. 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్ హోటల్ సెట్ను ఫైబర్, ఉడ్, ఐరన్ ఉపయోగించి తయారు చేశారు. ఈ సెట్స్ ఆడియన్స్కి సరికొత్త అనుభూతిని ఇస్తాయంటున్నారు.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics