హాట్ టాపిక్ : పవన్ తో పూరి !

Friday,February 28,2020 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ టాపిక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంటాయి. ఎక్కడ విన్నా ఆ టాపిక్ పైనే గంటల తరబడి చర్చ నడుస్తుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ -పూరి కాంబో సినిమా కూడా అదే విధంగా హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టి వరుసగా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తూ కాల్షీట్స్ ఇస్తున్నాడు పవన్.

వేణు శ్రీరాంతో ‘పింక్’ రీమేక్ , క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఆల్రెడీ సెట్స్ పై ఉన్నాయి. వీటి తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేస్తాడు పవన్. ఇది పవన్ 28వ సినిమాగా తెరకెక్కనుంది. అయితే హరీష్ శంకర్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడనే న్యూస్ ఇప్పుడు చర్చనియంశం అవుతుంది.

‘బద్రి’ తో పూరిని దర్శకుడిగా పరిచయం చేసాడు పవన్. వీరిద్దరి కాంబోలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే సినిమా కూడా వచ్చింది. పైగా పవన్ తో పూరి పొలిటికల్ డ్రామా సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ కాంబో సినిమాపై ఫాన్స్ స్పెషల్ ఫోకస్ పెడుతూ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మరి పవన్ -పూరి కాంబోలో సినిమా వార్త నిజమేనా తెలియాలంటే అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ ఆగాల్సిందే.