రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన స్వాతి

Wednesday,January 02,2019 - 02:59 by Z_CLU

హీరోయిన్ స్వాతి సినిమాలకు దూరమైంది. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త వికాస్ తో కలిసి ఇండోనేషియా వెళ్లిపోయింది. అయితే ఆమె పూర్తిగా సినిమాలను వదిలేయలేదు. మళ్లీ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైకి వస్తానంటోంది.

“సినిమాలకు నేను ఎప్పుడూ దూరం కాదు. నిజానికి నా భర్త కూడా ఎప్పుడు సినిమా చేస్తావంటూ నన్ను అడుగుతున్నాడు. కాబట్టి నేను కచ్చితంగా రీఎంట్రీ ఇస్తా. కాకపోతే అది ఎప్పుడునేది ఇప్పుడే చెప్పలేను.”

ఇలా రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది స్వాతి. ఇండస్ట్రీ నుంచి నిఖిల్ లాంటి ఫ్రెండ్స్ ఇప్పటికీ తనకు టచ్ లో ఉన్నారని చెబుతున్న ఈ మాజీ హీరోయిన్.. ఇండియాలో లేకపోయినా టాలీవుడ్ ను ఫాలో అవుతుంటానని తెలిపింది.

తెలుగులో ప్రస్తుతం మంచి సినిమాలొస్తున్నాయి, కొత్త దర్శకులు వస్తున్నారని, వాళ్లందరితో తనకు సినిమాలు చేయాలని ఉందంటోంది  స్వాతి.