రామ్ సరసన హీరోయిన్ గా అనుపమ ఫిక్స్

Tuesday,February 13,2018 - 10:03 by Z_CLU

హీరో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ మరోసారి హీరోయిన్ గా నటించనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ మేటర్ కన్ ఫర్మ్ అయింది. రామ్ సరసన అనుపమ మరోసారి ఫిక్స్ అయింది. దిల్ రాజు బ్యానర్ పై రామ్-అనుపమ హీరోహీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.

మార్చి 16 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. జూన్ లో మూవీని విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ నయా ప్రాజెక్టుకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. గతంలో రామ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాకు కూడా దేవిశ్రీనే సంగీత దర్శకుడు.

ఈ సినిమాకు ప్రసన్న కుమార్ కథ-మాటలు అందిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ కీ రోల్ లో నటించనున్న ఈ సినిమాకు విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రాఫర్ గా ఎంపికయ్యాడు. డైరక్టర్ త్రినాథరావు నక్కిన గతంలో నేను లోకల్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విషయం తెలిసిందే.