ఎట్టకేలకు ఇంటికి చేరిన హీరో

Saturday,June 06,2020 - 01:36 by Z_CLU

లాక్ డౌన్ టైమ్ కు హీరోహీరోయిన్లంతా తమ షూటింగ్స్ ఆపేశారు. అంతా ఇళ్లకు చేరుకున్నారు. రామ్, విజయ్ దేవరకొండ లాంటి అదృష్టవంతులైతే లాక్ డౌన్ కు సరిగ్గా కొన్ని రోజుల ముందు ఇంటికి చేరిపోయారు. అయితే ఒక్క హీరో మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. అతడే మలయాళ నటుడు పృధ్విరాజ్.

లాక్ డౌన్ కు ముందు తన కొత్త సినిమా ఆదుకాలమ్ షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లాడు పృధ్విరాజ్. ఆ దేశంలోని ఎడారిలో షూటింగ్ చేశారు. అదే టైమ్ లో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభనతో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఇటు ఇండియాలో కూడా విమాన సర్వీసుల్ని ఆపేయడంతో జోర్డాన్ లోనే లాక్ అయిపోయాడు పృధ్విరాజ్.

అలా దాదాపు 2 నెలలుగా జోర్డాన్ లో లాక్ అయిపోయిన పృధ్విరాజ్ ఎట్టకేలకు ఇండియా చేరుకున్నాడు. విదేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేయడంతో అందులో ఇండియాకొచ్చాడు.

ఇండియాకొచ్చిన తర్వాత కూడా ఇంటికెళ్లలేదు. 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాడు. అలా 2 నెలల లాక్ డౌన్, 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ పూర్తిచేసుకొని..ఈరోజు కుటుంబాన్ని కలుసుకున్నాడు పృధ్వీరాజ్. తన భార్య, కూతురితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు.

తమ హీరో సేఫ్ గా ఇంటికి చేరవడంతో పృధ్వీరాజ్ అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న లూసిఫర్, డ్రైవింగ్ లైసెన్స్ సినిమాల్లో ఇతడు నటించాడు.