కాన్సెప్ట్ బేస్డ్ కథతో ఆనంద్ దేవరకొండ

Tuesday,October 08,2019 - 10:06 by Z_CLU

‘‘దొరసాని’’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ, తన మూడో సినిమా ఎనౌన్స్ చేశాడు. ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ లో ఉన్న ఆనంద్, తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను ఎంచుకున్నాడు. షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి (యూ.ఎస్.ఏ) బ్యానర్ పై విజయ్ మట్టపల్లి,ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విజయ దశమి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

కామెడీ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో ఆనంద్ లుక్ కొత్తగా ఉండబోతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వాళ్ల ఎంపిక పూర్తయింది, త్వరలోనే పేర్లు ప్రకటిస్తారు. ఈ సినిమాతో ముగ్గురు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. కంప్లీట్ స్క్రీన్ ప్లే పూర్తయిన తర్వాత నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు.

టెక్నికల్ టీమ్:
పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా
మ్యూజిక్: అమిత్ దాసాని,సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల
ఆర్ట్: నీల్
నిర్మాతలు: విజయ్ మట్టపల్లి,ప్రదీప్ ఎర్రబెల్లి
రచన-దర్శకత్వం: దామోదర అట్టాడ.
బ్యానర్ : టాంగా ప్రొడక్షన్స్