నిర్మాతగా మారనున్న గబ్బర్ సింగ్ డైరెక్టర్ !

Wednesday,February 13,2019 - 12:04 by Z_CLU

‘గబ్బర్ సింగ్ ‘తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని రైటర్ కం డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్… ప్రస్తుతం వరుణ్ తేజ్ తో వాల్మీకి సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ డైరెక్టర్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. అయితే మరో నిర్మాత తో కలిసి కంబైన్ గా కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ నిర్మించాలని ఫిక్స్ అయ్యాడట హరీష్.

ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిన హరీష్ శంకర్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ నిర్మాత మహేష్ కోనేరు ను తన పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నాడని సమాచారం. ప్రస్తుతానికి హరీష్ శంకర్ -మహేష్ కోనేరు ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట.

త్వరలోనే హరీష్ శంకర్ తన బ్యానర్ అనౌన్స్ చేసి మహేష్ కోనేరుతో కలిసి చేయబోయే ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియజేస్తాడని సమాచారం. మరి గబ్బర్ సింగ్ డైరెక్టర్ నిర్మాతగా ఏ మేరకూ సక్సెస్ సాదిస్తాడో చూడాలి.