పూజా హెగ్డేపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Saturday,May 04,2019 - 04:49 by Z_CLU

వాల్మీకి సినిమా కోసం పూజా హెగ్డే భారీగా ఛార్జ్ చేసిందట.
ఆమె పోర్షన్ కూడా సినిమాలో చాలా తక్కువగా ఉంటుందట.

మొన్నటివరకు సోషల్ మీడియాలో జోరుగా తిరిగిన పుకార్లు ఇవి. వీటిపై దర్శకుడు హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యాడు. తమ సినిమా కోసం పూజా హెగ్డేకు భారీగా ఆఫర్ చేశామనే పుకారులో నిజం లేదంటున్నాడు హరీష్.

ఈరోజు ఉదయం ట్విట్టర్ లో స్పందించిన హరీష్, పూజా హెగ్డే పారితోషికానికి సంబంధించి వస్తున్న స్టోరీలన్నీ అబద్ధాలని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు పవన్ కల్యాణ్ తో కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. పవర్ స్టార్ తో సినిమా ప్రపోజల్ లేదని ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం ఈ దర్శకుడు వాల్మీకి మేకింగ్ తో బిజీగా ఉన్నాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండాకు రీమేక్ గా ఇది వస్తోంది. 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.