తెలుగు తెరపైకి మరో బాలీవుడ్ రీమేక్

Tuesday,February 19,2019 - 11:15 by Z_CLU

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై బాలీవుడ్ రీమేక్స్ కొత్తేంకాదు. ఒకప్పటి సీనియర్ హీరోల నుంచి ఇప్పటి యంగ్ స్టర్స్ వరకు అంతా హిందీ సినిమాల్ని దిగుమతి చేసుకున్నోళ్లే. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వచ్చి చేరబోతోంది. దీని పేరు గల్లీ బాయ్.

ఎస్.. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై సాయిధరమ్ తేజ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట నిర్మాత అల్లు అరవింద్. ప్రస్తుతానికైతే ఇంకా ఈ మేటర్ డిస్కషన్ స్టేజ్ లో ఉంది.

కెరీర్ లో ఇప్పటివరకు రీమేక్ సబ్జెక్ట్ లో నటించలేదు సాయిధరమ్ తేజ్. గల్లీబాయ్ ప్రాజెక్టు ఓకే అయితే తేజూ కెరీర్ లో ఇదే మొట్టమొదటి రీమేక్ అవుతుంది. రణ్వీర్ సింగ్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయింది. 4 రోజుల్లో 72 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.